telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్…

bhuma akhila priya

బోయిన్‌పల్లి కిడ్నాప్ ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.. దాదాపు 11 మంది కిడ్నాపర్లను నార్త్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, బెంగళూర్, మైసూర్, పుణెలో కిడ్నాపర్ల కోసం గాలించారు పోలీసులు.. మొత్తం 15 పోలీసు బృందాలుగా విడిపోయి.. ముమ్మరంగా గాలించి.. ఎట్టకేలకు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకువచ్చారు నార్త్ జోన్ పోలీసులు.. కిడ్నాపర్లకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్, ఇతర ఐడెంటిటీ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఈ 11 మంది కిడ్నాపర్లను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచినట్టుగా తెలుస్తోంది. మరోవైపు భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌ రెడ్డి ప్రమేయంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా చెబుతున్నారు.  బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిల ప్రియ పోలీసు కస్టడీ పూర్తైంది.. దీంతో.. ఆమెకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చనున్నారు.. అనంతరం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల లోపు.. అఖిల ప్రియను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించనున్నారు బోయిన్‌పల్లి పోలీసులు.

Related posts