ఇటీవలే చెన్నై వేదికంగా ఐపీఎల్-2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్పై ఆ దేశ మాజీ క్రికెటర్ క్లార్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంలో తక్కువ ధరకు పలికిన స్టీవ్ స్మిత్.. ఈ ఏడాది లీగ్లో ఆడకపోవచ్చని మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన స్మిత్ 12 కోట్ల 5 లక్షలు పలికాడు. కానీ పెద్దగా ఫాంలో లేకపోవడంతో అతన్ని రాజస్థాన్ రాయల్స్ వదులుకుంది. దీంతో అతన్ని ఎవరు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో.. ఢిల్లీ క్యాపిటల్ 2 కోట్ల 2 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. అయితే 2 కోట్లు తీసుకుని స్మిత్ ఆడతాడని తాను అనుకోవడం లేదన్నారు క్లార్క్.
next post