పంజాబ్ రాష్ట్రంలో ఓ మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మొహాలీలో జరిగాన ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
శిథిలాల చిక్కుకున్న ఇద్దరిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఎవరూ మృతిచెందినట్లుగా ఇంతవరకు అధికారిక సమాచారమేది రాలేదు. ప్రక్కనే ఉన్న భూమిని చదును చేసే క్రమంలో జేసిబీ ఈ భవనం గోడలను తాకడంతో భవనం కూలినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
జగన్ ఢిల్లీ టూర్తో రాష్ట్రానికి ప్రయోజనం లేదు: యనమల