దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో విడత లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని కేంద్రహోంశాఖ తెలిపింది.
కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై నిర్థయాధికారం రాష్ట్రాలకే అప్పగించింది. కరోనా హాట్స్పాట్స్ కేంద్రాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కంటైన్మెంట్జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అంతర్రాష్ట బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు..
-షాపింగ్ కాంప్లెక్స్లు ఓపెన్ చేసేందుకు అనుమతి
-ఆహార పదార్థాల హోం డెలివరీకీ అనుమతి
-కాలేజీలు, స్కూళ్లకు మే 31వరకు అనుమతి లేదు
-సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసివేత కొనసాగింపు
-హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం
– సభలపై నిషేధం కొనసాగింపు
-దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్
-మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్
-ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం
-భౌతిక దూరం పాటిస్తూ 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు అనుమతి
-అన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి
మోదీ కారణంగానే చంద్రయాన్-2లో వైఫల్యం.. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు