telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈసీపై సంచలన ఆరోపణలు చేసిన రాజాసింగ్

గ్రేటర్‌ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. నిన్న సాయంత్రానికే ప్రచారం ముగిసింది. రేపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్‌ కోడ్‌ పకడ్బందీగా అమలు చేస్తోంది స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లొంగిపోయిందని ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌ డబ్బులు పంపకాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఫైర్‌ అయ్యారు. డబ్బులు పంచుతుంటే.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని… ఇలాంటి ఘటనలు దారుణమన్నారు రాజాసింగ్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని రాజాసింగ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని కోరారు. బీజేపీ పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ పార్టీకి భయమెస్తుందని ఎద్దేవా చేశారు రాజాసింగ్. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మంచి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు రాజాసింగ్‌. 

Related posts