ఏపీలో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 98 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 15,612 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,17,156 కి చేరగా.. యాక్టివ్ కేసులు 1,43,795 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 15,62,229 కరోనా నుంచి కోలుకోగా 11,132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,94,48,056 కు చేరింది.
previous post