ఏపీలో పంచాయితీ ఎన్నికల వేడి తగ్గక ముందే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసాయి. ఏపీలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు… ఇవాళ పోలింగ్ జరుగుతోంది. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2 వేల 215 డివిజన్లు, వార్డులకు కలిపి… 7,552 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరోసారి సొంతపార్టీ నేతలే షాకిచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్ర పన్నారని ఆరోపించారు.టీడీపీ గెలిచినా పర్వాలేదంటూ 14 మందిని రెబల్స్ను బరిలోకి దింపారన్నారు. రెబల్స్ గెలవడానికి పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారని…నగరి,పుత్తూరులో వైసీపీ ఓటమికి కుట్ర పన్నారన్నారు రోజా. వెన్నుపోటుదారులను పార్టీ అధిష్టానం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత సాక్ష్యాధారులతో చూపించి వారిపై వేటు వేయిస్తానన్నారు రోజా.
previous post