telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రూ. 11.6 లక్షల కోట్ల అప్పు చేయనున్న కేంద్రం..

ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఇది మొత్తం పదో బడ్జెట్
కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన ఖర్చులను తీర్చడానికి మార్కెట్ నుండి దాదాపు రూ. 11.6 లక్షల కోట్ల రుణాన్ని తీసుకోనుంది.

  • కేంద్ర ప్రభుత్వం తమ ఖర్చులను తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి ఉంటుంది.
  • తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం ఏ మేరకు అప్పులు చేయాల్సి ఉంటుందనే దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
  • ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.9.7 లక్షల కోట్ల కంటే ఈ సంఖ్య దాదాపు రెండు లక్షల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.
  • 2022-23లో ప్రభుత్వం తీసుకున్న మొత్తం మార్కెట్ రుణాలు రూ. 11 లక్షల 58 వేల 719 కోట్లుగా అంచనా వేశారు.
    2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అప్పుల అంచనా రూ. 8 లక్షల 75 వేల 771 కోట్లు.
  • అయితే బడ్జెట్ అంచనాలో రూ.9 లక్షల 67 వేల 708 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఈ మొత్తం స్థూల రుణంలో గత రుణాల చెల్లింపు కూడా ఉంటుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ 20ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కాగా.
    ఈ బడ్జెట్ ద్వారా మోదీ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది.

మూడేళ్లలో 400 వందేభారత్‌ రైళ్లు నడపాలని, డిజిటల్‌ యూనివర్సిటీలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణం, 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు, డిజిటల్‌ కరెన్సీ, రైతుల ఖాతాలో రూ. 2.37 లక్షల కోట్ల బదిలీ, రత్నాలు, ఆభరణాలపై పన్ను మినహాయింపు, ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్‌ను ప్రోత్సహించాలని కేంద్రం ప్రకటించింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నాలుగో బడ్జెట్ కావడం విశేషం.

Related posts