telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

1-9వ తరగతులపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 9వ తరగతుల్లోని విద్యార్దులను పరీక్షలు లేకుండానే అందర్నీ.. పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీనే 1-9 తరగతు విద్యార్ధులకు లాస్ట్ వర్కింగ్ డే అని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం… పదో తరగతి విద్యార్ధులకు యధావిధిగా క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు పెట్టాలని స్పష్టం చేసింది. 1-9వ తరగతుల విద్యార్ధులకు డ్రై రేషన్ పంపిణీ చేయాలని సూచనలు చేసింది ప్రభుత్వం. పదో తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నా భోజన అందివ్వాలన్న ప్రభుత్వం… సీఎం సమక్షంలో జరిగిన హై లెవల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసిoది ప్రభుత్వం.

Related posts