గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయి ప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసినందుకు సాయి ప్రియ, ఆమె ప్రియుడిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా సాయిప్రియ తండ్రి అప్పలరాజుపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు విశాఖపట్నం త్రీటౌన్ సీఐ రామారావు తెలిపారు. సాయి ప్రియ ప్రియుడితో వెళ్లిపోతున్నట్లు తన తండ్రికి సమాచారం ఇచ్చింది.
అయితే ఈ విషయాన్ని అతడు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని సాయి ప్రియ భర్త ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన సాయి ప్రియ తండ్రి అప్పలరాజు ప్రభుత్వ ధనాన్ని వృథా చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. కోర్టు అనుమతితో సాయి ప్రియ తండ్రిపై 182 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
సాయి ప్రియ తన ప్రియుడు రవితేజతో వెళ్లిపోతున్నట్లు తండ్రికి ముందే తెలిసిందని, సాయిప్రియ భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఘటనపై విచారించిన పోలీసులు కోర్టు అనుమతితో యాక్షన్ షూరు చేశారు.
గత నెల జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్తో కలిసి సాయిప్రియ ఆర్కేబీచ్కి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఇద్దరూ సరదాగా గడిపారు. ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పి ప్రియుడు రవితేజతో కలిసి వెళ్లిపోయింది. తర్వాత తండ్రి పిర్యాదుతో సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది పెద్ద ఎత్తున బీచ్లో గాలింపు చర్యలు చేపట్టారు. సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు సమాచారం అందడంతో అంతా అవాక్కయ్యారు.
ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశాం: చంద్రబాబు