telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కట్టుబాట్లు పాటించికపోతే చరిత్రహీనులే: కేశినేని నాని

kesineni-nani

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల డిక్లరేషన్ అంశం చర్హనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ నేతలకు, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధం కూడా జరిగింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ట్విట్టర్ లో స్పందించారు.

ఏ కులానికి అయినా, ఏ ప్రాంతానికైనా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉంటాయని పేర్కొన్నారు. అవి తరతరాలుగా వస్తున్నాయని కేశినేని నాని తెలిపారు. అయితే, అత్యున్నత స్థాయిలో ఉన్నవారు వాటిని పాటిస్తే ఒక గొప్ప ఒరవడి సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అవి పాటించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Related posts