telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో తగ్గని కరోనా జోరు.. ఇవాళ మరో

ap map

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ జోరు కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 4622 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 763573 కు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు ఇవాళ పెరిగాయి. ఈరోజు 35 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6291కు చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 763573 పాజిటివ్ కేసులకు గాను, 714 ,427 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 42855 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 72082 కరోనా పరీక్షలు చేసారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related posts