telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మరోసారి హాస్పిటల్లో చేరిన నాయిని నర్సింహా రెడ్డి…

తెలంగాణ హోంశాఖ మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌ నాయిని న‌ర్సింహారెడ్డి మరోసారి హాస్పిటల్లో చేరారు.. గ‌త నెల క‌రోనా వైర‌స్ బారిన పడ్డారు నాయిని. ఆ సమయంలో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌నే ప్ర‌చారం కూడా సాగింది. అప్పుడు నాయిని ఆరోగ్యపరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తర్వాత ఆస్ప‌త్రిలో చికిత్స‌పొంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో, ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ‌స‌భ్యులు.. అయితే, ఆయ‌న మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరారు.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఒక ప్రముఖ ఆస్పత్రిలో నాయిని నరసింహ రెడ్డి చేరారు అని చెబుతున్నారు. ప్ర‌స్తుతం నాయినికి ఆస్ప‌త్రిలో ట్రీట్మెంట్ కొన‌సాగుతోంది. కొద్ది రోజుల క్రిత‌మే క‌రోనా నుంచి కోలుకుని మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేర‌డంతో ఆయన అనుచరులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కానీ కరోనాను జయించి బయటకు వచ్చిన నాయిని ఇప్పుడు కూడా మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతో బయకు రవళి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts