telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో కరోనా అప్డేట్…24 గంటల్లో

ఏపీలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 3676 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 779146కి చేరింది. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు ఇవాళ తగ్గాయి. ఈరోజు 24 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6406కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 779146 పాజిటివ్ కేసులకు గాను, 735638 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 37102 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70881 మందికి పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 6991258 కు చేరుకుంది.

Related posts