telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

Ghmc తో పాటు 2023లో దుబ్బాక నుండే పోటీ చేస్తా..

దుబ్బాక ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో ఎవరిని మోసం చేయలేదని..రాజకీయ కక్ష్యతోనే నా పై కేసులు పెట్టారని పేర్కొంది. రెండు నెలల క్రితమే ఈ విషయంలో సదరు వ్యక్తికి లీగల్ నోటీసు ఇచ్చామని..సడన్ గా ఇప్పుడెలా సివిల్ కేసులో చీటింగ్ కేసు నమోదు చేస్తారని ఫైర్ అయింది కత్తి కార్తీక . నామినేషన్ విత్ డ్రా చేయమని నా మీద ఒత్తిడి లు వస్తున్నాయని.. కేసును న్యాయ పరంగా ఎదుర్కొంటానని తెలిపింది. మొన్నటికి మొన్న నన్ను చంపుతామని బెదిరిస్తే రామయంపేట పీఎస్ లో ఫిర్యాదు చేశానని పేర్కొంది అభ్యర్థి  కత్తి కార్తీక . ఒక మహిళగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాజకీయాల్లోకి వస్తే ఇన్ని అడ్డంకులా ? అని ప్రశ్నించింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజకీయాలను వీడనని స్పష్టం చేసింది. Ghmc ఎన్నికలతో పాటు 2023లో దుబ్బాక నుండే పోటీ చేస్తానని ప్రకటించింది కత్తి కార్తీక.

Related posts