భారత్లో ఓపెన్ సేల్లోనే షియోమీకి చెందిన రెడ్మీ నోట్ 7 స్మార్ట్ఫోన్ లభిస్తున్నది. ఈ ఫోన్ భారత్లో ఫిబ్రవరి నెలలో రూ.9,999 ప్రారంభ ధరకు విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ ఫోన్ను ఆన్లైన్లో కేవలం ఫ్లాష్ సేల్లోనే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ను ఓపెన్ సేల్లో విక్రయిస్తున్నారు. ఫ్లిప్కార్ట్, ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్స్లో వినియోగదారులు ప్రస్తుతం రెడ్మీ నోట్ 7 ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.
రెడ్మీ నోట్ 7 ప్రధాన ఫీచర్స్.. :
రెడ్మీ నోట్ 7 స్మార్ట్ఫోన్లో 6.3 ఇంచుల డిస్ప్లే
స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.