telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

రెచ్చిపోయిన ఏబీ.. మళ్ళీ గెలుపు బాటలో బెంగళూరు

ఏబీ డివిలియర్స్ మరోసారి రెచ్చిపోయాడు. ఏబీ బ్యాటింగ్ దాటిని ఏ బౌలర్ ఆపలేకపోయారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు విజయ కేతనం ఎగరవేసింది. పడిక్కాల్ 35, విరాట్ కోహ్లీ 43, ఏబీ డివిలియర్స్ 55  రాణించడంతో 7వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఒక దశలో 3 ఓవర్లకు 45పరుగులు చేయాల్సి ఉండగా.. ఏబీ డివిలియర్స్ అద్భుతం చేసేసాడు. దీంతో బెంగళూరు విజయం అనివార్యం అయింది. అంతకు ముందు టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ ఓపెనర్లను బెంగళూర్ బౌలర్లు ముందుగా ఒత్తిడికి గురిచేసిన ఆ తర్వాత రాబిన్ ఉతప్ప 22 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్ తో మొత్తం 41 పరుగులు చేసి ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ స్మిత్ 36 బంతుల్లో 57 పరుగులతో అర్ధశతకం పురుగు చేసి ఔట్ అయ్యాడు. కానీ చివర్లో ఆర్చర్ బ్యాట్ తో మెరుపులు మెరిపించకపోవడంతో రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇక బెంగళూర్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4 వికెట్లు సాధించగా యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు తీసుకున్నాడు.

Related posts