దేశవ్యాప్తంగా కరోనా ( corona ) సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. వరుసగా ఏడో రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొదటి దశలో చిన్నారులపై కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ సెకండ్ వేవ్ ( second wave )లో పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్నారులు, 18 ఏండ్ల వయసులోపు ఉన్నవారికి సంబంధించి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఇందులో బాగంగానే కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ అందించనున్నారు. ఇప్పటికే దేశంలో 45 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నారు. అయితే, 18 ఏళ్ళు నిండిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను ఫ్రీగా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం విశేషం. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా లో నిన్నటి నుంచి ఓ వార్త వీరల అవుతోంది. పీరియడ్స్ కు 5 రోజుల ముందు, పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవద్దని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వ్యాక్సిన్ వేసుకున్న తొలి రోజుల్లో ఇమ్యూనిటీ తగ్గుతుందని, ఆ తర్వాత క్రమంగా పెరుగుతుందని అందులో ఉంది. అందుకే పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని దాని సారాంశం. ఈ న్యూస్ నిన్నటి నుంచి బాగా వీరల అవుతోంది. అయితే ఈ న్యూస్ ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పింది.
previous post
పూజా హెగ్డే నడుముపై దర్శకేంద్రుడి చమత్కారం… సంచలనంగా మారిన వ్యాఖ్యలు