telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ కు మాజీ మంత్రి గంటా లేఖ

AP DSC Merit list released Minister Ganta

విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం జగన్ కు శుక్రవారం లేఖ రాశారు. చంద్రబాబు హయాంలో విశాఖలో భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేశారు. సిట్ విచారణ నివేదికపై చర్యలు తీసుకోవాలని ఆనాడు విపక్షాలు డిమాండ్ చేశాయి.ఈ భూ కుంభకోణం విషయంలో ఆనాడు గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా, ప్రత్యక్షంగా విపక్షాలతో పాటు స్వంత పార్టీకి చెందిన నేతలు కూడ విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని గంటా జగన్ కు లేఖ రాయడం ప్రాదాన్యత సంతరించుకొంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని తానే కోరిన విషయాన్ని గంటా ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు కావాలని వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు కోరుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు సిట్ దర్యాప్తును కోరుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నట్టుగా ఆ లేఖలో గంటా పేర్కొన్నారు.

Related posts