నేడు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. కాగా ప్రశ్నోత్తర సమయంలో నిత్యావసర ధరలు పెరుగుదల, టెలి మెడిసిన్ కేంద్రాలు పనిచేయకపోవడం..ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికలో వివక్షతపై టీడీపీ ప్రశ్నించనుంది. అలాగే వేరుశనగ, పసుపు పంటలకు మద్దతుధర లేకపోవడంపై ప్రశ్నించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
previous post