telugu navyamedia
వార్తలు సామాజిక

ఈ నెల 20 నుంచి బీటెక్‌ పరీక్షలు

exam hall

ఈ నెల 20 నుంచి బీటెక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జంబ్లింగ్‌ విధానాన్ని జేఎన్‌టీయూహెచ్‌ రద్దు చేసింది. కాలేజీల్లో చదివిన కాలేజీల్లోనే పరీక్షల నిర్వహణకు వర్సిటీ ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్ష పేపరులోనూ మార్పులు చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మార్గదర్శకాలను జారీచేశారు. బీటెక్‌ ప్రశ్నాపత్రంలో పార్టు-ఏ, పార్టు-బీ విధానాన్ని రద్దు చేసి మొత్తం ఒకే విభాగంలో ప్రశ్నలు రూపొందించామని తెలిపారు.

ప్రతి ప్రశ్నాపత్రంలో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఐదింటికి జవాబు రాయాలి. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించినట్టు గోవర్ధన్‌ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఐసీఎంఆర్‌ సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని, విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts