telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు : ఎమ్మెల్సీ కవిత మరో వీడియో సందేశం

kavitha trs

గ్రేటర్‌ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ఎన్నికలపై ఎమ్మెల్సీ కవిత మరో కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఆరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అమలు చేసిందని… హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతోందని చెప్పారు. వరుసగా ఐదేళ్లుగా దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరబాద్‌ ఉందని పేర్కొన్నారు. మహా నగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, శాంతి భద్రతలు, 24 గంటల కరెంటు, పార్కులు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు ఇవన్నీ సీఎం కేసీఆర్‌ నాయకత్వం, కేటీఆర్‌ పర్యవేక్షణతోనే సాధ్యమయ్యాయని కొనియడారు. అభివృద్ధి కొనసాగించేందుకు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ను మీ కలల నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ కు మరోసారి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత.

Related posts