telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి తేజస్వి సూర్య…

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారానికి చెయ్యడానికి బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య నగరానికి వచ్చాడు. ఈ క్రమములో అయన మాట్లాడుతూ.. దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది, దేశంలోనే తెలంగాణ యువత ‘వెల్ టాలెంటెడ్ & హార్డ్ వర్కింగ్’ యువతను కలిగివుంది. ఏ పోటీ పరీక్షలో నైనా టాప్ టెన్ లో 50 % ఏపీ, తెలంగాణ వారివేనన్నారు తేజస్వి సూర్య. ఇక్కడ ప్రభుత్వం ఒక్క ఫ్యామిలీ కోసమే పనిచేస్తుంది.. నేనొక సామాన్య కార్యకర్తను.. నన్ను పార్టీ జాతీయ నేతను చేసింది. ప్రజాస్వామ్యం అర్దాన్ని ఇక్కడ మార్చారు. ప్రజాస్వామ్యం అంటే ఒక్క ఫ్యామిలే కోసమే, రాజకీయాలను ప్రైవేట్ కంపెనీలుగా మార్చారు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థాన్ని ఇక్కడ తీసుకురావాల్సి ఉందన్నారు తేజస్వి సూర్య. దేశం కుటుంబ రాజకీయాల్ని తిరస్కరిస్తుంది. భారతదేశంలో పట్టణీకరణకి ప్రాధాన్యం ఇచ్చింది అటల్ బిహారి వాజపేయి, బీజేపీ అధికారంలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ లలో అభివృద్ధి స్పీడ్ గా జరుగుతుంది. ఇక్కడ ఉన్నట్లు అక్కడ కబ్జాలు లేవు. రజాకార్ల రాజ్యం కాదు తీరంగా జండా సగర్వంగా ఒవైసికి ఇక్కడ ఓటు వేస్తే ఆయన మహారాష్ట్ర, బీహార్, యూపీ, కర్ణాటకల్లో బలోపేతం అవుతాడు. మహమ్మద్ అలీ జిన్నా కొత్త అవతారము అసదుద్దీన్ ఒవైసీ.. ఈ దేశాన్ని ఇస్లామీకరణ కానియ్యం అన్నారు తేజస్వి సూర్య. అక్బరుద్దీన్, ఆసద్దుద్దీన్ ఇది నిజాం కాలం కాదు.. హిందు హృదయ సామ్రాట్ మోడీ కాలం. ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, టర్కి ప్రధాని భారత్ ని వ్యతిరేకిస్తాడు, ఎంఐఎం ఒక్కటే దేశాన్ని పాకిస్తాన్ కావాలని అనుకుంటుంది, అందుకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారు. మేము హైదరాబాద్ ని ఇస్తాంబుల్ చేయము, మేము హైదరాబాద్ ని భాగ్యనగర్ చేస్తాం అని పేర్కొన్నారు.

Related posts