telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పద్మ పురస్కారాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

Padma Awards

పద్మ పౌర పురస్కారాల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్ నామినేషన్లు / ప్రతిపాదనల ప్రక్రియ ఈ ఏడాది మే ఒకటో తేదీన ప్రారంభం కాగా, దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల 15 వరకు పెంచింది.

ఇప్పటి వరకు 8,035 దరఖాస్తులు రాగా 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ పురస్కారాల కోసం నామినేషన్లు, ప్రతిపాదనలను https://padmaawards.gov.in.కు పంపించాలి 

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు పద్మ పురస్కారాలను ప్రదానం చేసి ప్రభుత్వం గౌరవిస్తోంది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాల ప్రదానం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కొనసాగుతోంది.

Related posts