ముంబై మహానగరంలోని కండివాలి ప్రాంతంలో ఒక మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల తరువాత బీఎంసీ అధికారులు చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్ అని తెలిపారు. దీంతో మృతుని బంధువులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
జూలై 20న నేహా(28) గుప్తా అనే మహిళ న్యుమోనియా, టీబీతో బాధపడుతూ కూపర్ అనే దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పుడు సాధారణ మృతి అని వైద్యాధికారులు చెప్పడంతో కుటుంబీకులు నేహా మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అయితే ఇది జరిగిన మూడు రోజుల తరువాత ఆమెకు కరోనాతో మృతి చెందిందని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై మండిపడుతున్నారు.