నేడు అసోం ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ చార్ట్పై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అసంతృప్తి వ్యక్తి చేశారు. ప్రముఖమైన ఈ జాబితా నుంచి అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది భారతీయులు తప్పించబడ్డారన్నారు. నిజమైన భారతీయులు ముఖ్యంగా బెంగాలీ హిందువులు ఎన్ఆర్సీ జాబితా నుంచి తొలగించబడి విదేశీయులు చేర్చబడ్డారన్నారు.
ఈ తప్పుకు కారణమేంటో బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అసోం గణన 1985 ప్రామాణికంగా జాబితాను రూపొందించాలన్నారు. హిందూ, ముస్లిం అనేది విషయం కాదని విదేశీయులు జాబితాలో ఉండొద్దని తరుణ్ గొగోయ్ పేర్కొన్నారు.
ఆ విషయాల్లో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది: బీజేపీ