జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది విమర్శల దాడి పెరుగుతుంది. అయితే ఈ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి… లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించామంటూ మంత్రి కేటీఆర్ అబ్దాలు చెబుతున్నారని ఆరోపించిన ఆయన.. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితా కేటీఆర్ ఇస్తే… తాను టీఆర్ఎస్కే ప్రచారం చేస్తానంటూ.. టీఆర్ఎస్కు ఆఫర్ ఇచ్చారు… లక్ష మంది లబ్ధిదారుల జాబితా ఇప్పుడు బయటపెడితే మా పార్టీ అభ్యర్థులకు కూడా టీఆర్ఎస్ కండువా కప్పి.. కేటీఆర్ గొప్పోడు అని ప్రచారం చేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి… మరోవైపు.. 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. 10 లక్షల మంది లిస్ట్ బయట పెడితే ప్రగతి భవన్ ముందు వాచ్మెన్గా పనిచేస్తానంటూ వ్యాఖ్యానించారు. మరి రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు..? ఎలా కౌంటర్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి రేవంత్ వ్యాఖ్యల పైన తెరాస నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.
previous post