telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు

జార్ఖండ్ లో ప్రారంభమైన మూడో విడత పోలింగ్

evm issues even in 4th schedule polling

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నేడు పోలింగ్ జరగనున్న 17 నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 40 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నరని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వినయ్ కుమార్ వెల్లడించారు.

నేడు పోలింగ్ జరగనున్న 17 నియోజకవర్గాల్లో మొత్తం 309 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. . రాంచీ, హతియా, కాన్కే, జర్కతా, రామ్‌గర్ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మిగతా సమస్యాత్మక నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది.

Related posts