telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు: కేటీఆర్‌

ktr telangana

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ఇన్‌చార్జిలతో కేటీఆర్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పట్ట భద్రుల ఓటర్లనమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆపార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వివిధ నియామాక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీచేశామని తెలిపారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Related posts