దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి కేంద్రంలో కొత్త ప్రధాని రావడం ఖాయమని ఉమ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని జగన్ కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రశాంత్కిషోర్, జగన్, విజయసాయిరెడ్డి పాపాలు బయటకు రావాలని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ గెలవాలని కేవీపీ కుట్రలు పన్నారని ఉమ ఆరోపించారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని, అయితే పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్లైన్లో ఉందన్నారు. కేవీపీపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని దేవినేని ఉమ ఆరోపించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే రీపోలింగ్ కోసం ఈవీఎంలకు మరమ్మతులు చేయాలని లేదంటే కొత్తవి పెట్టాలన్నారు. మరమ్మతుల కోసం ఆరు గంటల సమయం తీసుకున్నారని.. ఒక ఈవీఎం స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి ఆరు గంటల సమయం అవసరమా?అని ప్రశ్నించారు. ఈవీఎంలు పాడైపోతే మళ్లీ వచ్చి పోలింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.