ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి విరుచుకుపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయడమంటే ప్రభుత్వంలోని మూడు శాఖలను మూడు నగరాలకు విభజించడం కాదని విమర్శించారు.
ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖను ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత అభివృద్ధి చెందిన నగరానికి తరలించడం వికేంద్రీకృత అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకృత అభివృద్ధి అంటే జిల్లాలకు, స్థానిక సంస్థలకు అధికారాలను అప్పగించడమని ఆయన పేర్కొన్నారు.