telugu navyamedia
వార్తలు సామాజిక

పెళ్లి వంట మాస్టర్ కు కరోనా.. క్వారంటైన్‌లోకి కొత్త జంట!

వివాహవేడుకల్లో వంట చేసిన మాస్టర్‌కు వైరస్ సోకడంతో నూతన వధూవరులతో సహా పెళ్లికి హాజరైనవారు అందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం భారీనపడ్డాడు.

దీంతో పరీక్షలు చేయించుకుంటే మాస్టర్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అధికారులు పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు.

Related posts