పోలవరం ప్రాజెక్టు ను ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సందర్శించారు. ఎన్నికలప్రచారంలో బిజీగా ఉండడం వల్ల పనుల పురోగతిపై ఇన్నాళ్లు దృష్టిసారించని ముఖ్యమంత్రి పనుల పరిస్థితిపై విహంగ వీక్షణం చేశారు. ఎన్నికల నియమావళి అడ్డు వస్తుందన్న వ్యాఖ్యల నేపధ్యంలో తొలుత కాస్త వెనుకడుగు వేసినా అటువంటి నిబంధన ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఆయన ప్రాజెక్టును సందర్శించారు.
పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ పర్యటన అనంతరం మధ్యాహ్నానికి సీఎం అమరావతి చేరుకుంటారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఓటింగ్ సరళి, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆయన ఢిల్లీ బయుదేరి వెళ్లనున్నారు. వీ ప్యాట్లు లెక్కింపు రివ్యూ పిటిషన్పై వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు.