telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ లో మరో శిల్పారామం.. ఈ నెల 22న ప్రారంభం!

uppal shilparamam

హైదరాబాద్ నగరవాసుల సందర్శన కోసం మరో శిల్పారామం సిద్దమైంది. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో ఏర్పాటుచేసిన మినీ శిల్పారామం ఈ నెల 22న ప్రారంభం కానున్నది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ, శిల్పారామం విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు.

హెచ్‌ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్‌లోని ఏడున్నర ఎకరాల స్థలంలో రూ. ఐదు కోట్లతో మినీ శిల్పారామాన్ని నిర్మించారు. మాదాపూర్‌లో ఉన్న శిల్పారామం తరహాలోనే హస్తకళలు, చేనేత వస్ర్తాల కోసం 50 స్టాళ్లను ఏర్పాటుచేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలు సేదతీరడానికి పచ్చని మైదానం, చూపరులను ఆకట్టుకొనే రీతిలో శిల్పారామం ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటుచేశారు.

Related posts