తూర్పు గోదావరి జిల్లాలోని మడ అడవులను నరికివేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడకు రక్షణ కవచం లాంటి ఈ అడవుల నరికివేతతో అక్కడి ప్రాంతం ఎలా మారిపోయిందో తెలుపుతున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. కాకినాడకు రక్షణ కవచం లాంటి మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుపానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటీ? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?’ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మడ అడవులను జగన్ నుంచి కాపాడాలంటూ హ్యాగ్ ట్యాగ్ జోడించారు.
ఐఏఎస్ లు ముఖ్య పాత్ర నిర్వహించాలి: నితిన్ గడ్కరీ