తెలంగాణలో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిరిసిల్ల జిల్లాల్లో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.
బెంగాల్ లో హింస రాజ్యమేలుతోంది: మోదీ