telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

మదనపల్లె కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైద్యులు !

మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు.  మదనపల్లె జంటహత్యల కేసు ఏపీనే కాకుండా..ఇతర రాష్ట్రాలనూ కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం విశాఖలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడు చికిత్స పొందుతున్నారు. భార్య భర్తలిద్దరికి పూర్తి స్థాయిలో చికిత్స కొనసాగుతోంది. 4వ యూనిట్ లోని అరుంధతి వార్డులో పద్మజ, శ్రీకృష్ణ వార్డులో పురుషోత్తం నాయుడును వేరువేరుగా ఉంచి పరిశీలిస్తున్నారు వైద్యులు. నిందితులు ఇద్దరు చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇంకా ఒత్తిడిలోనే ఏ1 పురుషోత్తం నాయుడు ఉన్నట్టు.. మరికొన్ని రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు వైద్యులు. క్లోజ్డ్ వార్డు వద్ద సెక్యురిటీగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లలను ఏర్పాటు చేశారు పోలీసులు. నిందితులు పూర్తిగా కోలుకున్నాక జైలు అధికారులకు సమాచారం ఇస్తామని వైద్యులు స్పష్టం చేశారు.

Related posts