దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి, మోసం చేసిన కేసులో ఆయన జ్యుడీషియల్ రిమాండులో వున్నారు.
పలువురిని మోసం చేసిన కేసులో నూతన్ నాయుడును మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.ఈ నేపథ్యంలో విశాఖలోని కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. శని, ఆది, సోమవారాల్లో విచారించడానికి పోలీసులకు జడ్జి అనుమతించారు.