telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పిల్లి శాపాలకు భయపడం.. ‘యూటర్నుల’ బాబు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. పిల్లి శాపాలకు ఎవరు భయపడబోరని చర్యకలు అంటించారు విజయసాయిరెడ్డి.
“పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే జోస్యాలు చెబ్తున్నావు. వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చెన్నతో సహా సీనియర్లందరికి భవిష్యత్తు అర్థమవుతోంది. భ్రమల నుంచి బయటపడు. ‘యూ టర్నుల’ బాబు ప్రత్యేక హోదా కోసం నిస్సిగ్గుగా మళ్లీ తీర్మానం చేయించాడు. అప్పట్లో ప్యాకేజే ముద్దు అని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. నా దగ్గర చిప్ప మాత్రమే ఉంది. డబ్బు ఉంటే నీకో లక్ష ఇచ్చే వాడిని అనే తుపాకి రాముడి కామెడీ గుర్తొస్తోంది.” అంటూ ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి.

Related posts