ఏపీలో రెండురోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి నేటి ఉదయం తిరుమల శ్రీవారినిని దర్శించుకున్నారు. తన భార్య సవితా కోవింద్, ఇతర కుటుంబీకులతో కలిసి, పద్మావతి అతిథి గృహం నుంచి తొలుత వరాహస్వామిని దర్శించుకుని, ఆపై ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
ఆలయ పూజారులు ఆయనకు పట్టువస్త్రాలను అందించి, స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కోవింద్ కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. నిన్న తిరుమలకు చేరుకున్న ఆయన, సాయంత్రం పద్మావతి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో కోవింద్ శ్రీహరికోటకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, చంద్రయాన్-2 ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలించనున్నారు.
వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల…