దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్పై అబద్దాలు మాట్లాడటం మంచి పద్దతి కాదని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రికి ఉండాల్సిన కనీస హుందాతనం లేకుండా మాడ్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్ను కాపాడేందుకే ఆగమేఘాలపై హైకోర్టును విభజించారని ఆరోపించారు. బీజేపీకి దమ్ముంటే జగన్తో కలిసి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఏపిలో పోటిచేయడానికి బిజెపికి అభ్యర్థులు ఉన్నారా? అని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతలు కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజుల భాషలకు మోదీ సంబరపడుతున్నారన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కన్నా.. తన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే బిజెపిలో చేరారని మంత్రి విమర్శించారు.చంద్రబాబును చూస్తే మోదీకి భయం వేస్తుందని,అందుకే ఉపాధి కులీల నిధులు కుడా విడుదల చేయకుండా కేంద్రం కక్ష సాధిస్తోందని మంత్రి ఆనంద్ బాబు విమర్శించారు.