telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేవాలయాలను కాపాడుకుంటాం: మంత్రి వెల్లంపల్లి

vellampalli srinivas ycp

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కాపాడుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై మంత్రి స్పందింద్చారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని మంత్రి అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెప్పారు. అలసత్వం వహించిన అధికారులపై ఇప్పటికే బదిలీ వేటు వేశామని, పలువురిని సస్పెండ్ చేశామని చెప్పారు. అగ్నిప్రమాదంలో స్వామివారి రథం దగ్ధం కావడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related posts