తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ హైదరాబాద్లోని ప్రగతి భవన్ లో నిన్న సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వ్యవహారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.విభజన సమస్యలపై తదుపరి చర్చలను అమరావతిలో కొనసాగిద్దామని ఏపీ సీఎం జగన్ చెప్పగానే, తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు అంగీకరించారు.
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, గోదావరి నీటి తరలింపు, ఉద్యోగుల బదిలీ సమస్యలపై చర్చించారు. ఇక జగన్ నేడు జరూసలేం వెళ్లనుండగా, తిరిగి వచ్చిన తరువాత సమస్యలపై మరోసారి జరిగే సమావేశం అమరావతిలో ఉండాలని జగన్ భావించారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కు చెప్పి, ఏపీకి రావాలని ఆహ్వానించగా అందుకు కేసీఆర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..చంద్రబాబుకు గిఫ్ట్ గా మారుతుంది: పవన్