telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిమ్మగడ్డ పునర్నియామకంపై స్పందించిన సోమిరెడ్డి

somireddy chandramohan

ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఎస్ఈసీ విషయంలో వైఎస్‌ జగన్ ప్రభుత్వం అనేకసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల మెట్లెక్కి వారి తీర్పులు ధిక్కరించినా కడకు తలొంచక తప్పలేదన్నారు.

నిమ్మగడ్డ రమేశ్ గారి పునర్నియామకం విషయంలో ప్రభుత్వ తీరు తప్పని సామాన్య మానవుడు కూడా అభిప్రాయం చేశారు. అయినపట్టికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లెక్కచేయలేదు.ఆయన సలహాదారులెవరోకానీ వారికి కనీస జ్ఞానం కరవైనట్టుందని దుయ్యబట్టారు.

కోర్టులతో మొట్టికాయలు తినడంతో పాటు వితండవాది అని దేశమంతా పేరుతెచ్చుకుంటున్నారని విమర్శించారు. చివరకు ఏమైంది? ఆ రమేష్ కుమార్‌ గారినే అదే స్థానంలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సహరాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తారని ఆశిస్తున్నానని సోమిరెడ్డి చెప్పారు.

Related posts