భారత్ పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ప్రశంసించారు. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులపై జరుగుతున్న పోరాటంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాన మోడి ఐరాస కార్యాలయానికి 193 సౌర ఫలకలు బహుకరించారని ఇవి ఐరాసకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
కర్బన ఉద్గారాల నుంచి విముక్తి కోసం కొన్ని దేశాలు అణుఇంధనం దిశగా అడుగులు వేస్తున్నాయని గుటెరస్ అన్నారు. తమ అవసరాల కోసం మోడీ ప్రభుత్వం సైతం అణు ఇంధనంపై దృష్టిసారించిందని గుటెరస్ కొనియాడారు.