telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాలయోగి స్వయంకృషితో ఎదిగిన మేధావి: చంద్రబాబు

chandrababu

లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను స్మరించుకున్నారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయులని చెప్పారు. అమలాపురం నుంచి ఢిల్లీకి స్వయంకృషితో ఎదిగిన మేధావి అని అన్నారు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి మారుపేరని కొనియాడారు.

కోనసీమ అభివృద్ధి ప్రదాతగా, లోక్ సభకు తొలి దళిత స్పీకర్ గా ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారని అన్నారు. బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ నేత ఆశయాలను స్మరించుకుందామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజానీకానికి అండగా ఉందామని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేద్దామని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

Related posts