వరద బాధితులకు ఇచ్చే పరిహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పదివేల రూపాయల ఆర్ధికసాయాన్ని అనర్హులకు ఇచ్చారని ఫైర్ అయ్యారు రాజాసింగ్. జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడ్వాన్స్గా పరిహారాన్ని అందించారని సంచలన ఆరోపణలు చేశారు. ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు రాజాసింగ్. పదివేల రూపాయల పరిహారం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారని మండిపడ్డారు రాజాసింగ్. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజాసింగ్. కాగా..హైదరాబాద్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అష్టకష్టాలు పడిన విషయం తెలిసిందే. భారీ వరదల తో చాలా కాలనీలు మునిగిపోయాయి. అయితే… ఆ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు. దీంతో ప్రముఖులు, సిని హీరోలు స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు కూడా ఇచ్చారు. దీంతో వరద బాధితులకు కుటుంబానికి పదివేల రూపాయాలు ఆర్థికసాయం అందజేశారు.
previous post
చంద్రబాబుపై మంత్రి శంకర నారాయణ కీలక వ్యాఖ్యలు…