ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి కోసం 25 పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్లో గాలిస్తోన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దుబేను పట్టుకున్నారు. అనంతరం అతడిని నడిరోడ్డుపై పోలీసులు ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. యూపీలోని హమీర్పూర్లోని మౌదాహా గ్రామంలో పోలీసులు నిన్న ఎన్కౌంటర్లో వికాస్ అబే అనుచరుడు అమర్ దూబేను హతమార్చారు. దీంతో తనను కూడా కనపడగానే హతమార్చుతారన్న భయపడుతోన్న వికాస్ దూబే పోలీసులకు లొంగిపోవాలని ప్రయత్నాలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి.
పోలీసులకు అతడి గురించి ఎలా సమాచారం అందిందన్న విషయం తెలియాల్సి ఉంది.