telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాజస్థాన్ లో ఇండియన్ ఆర్మీ అద్భుతం…

రాజస్థాన్ లో ఇండియన్ ఆర్మీ ఓ అద్భుతాన్ని చేసి చూపింది.  కేవలం మూడు గంటల వ్యవధిలోనే 100 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.  రాజస్థాన్ లోని బార్మెల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న కస్తూర్బా గర్ల్స్ హైస్కూల్ లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.  జిల్లాలో కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడిపోతున్నది.  పైగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఇండియన్ ఆర్మీ సహాయం కోరారు.  రాత్రి 9 గంటల సమయంలో అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ 40 మంది సైనికులను రంగంలోకి దించింది.  కేవలం 3 గంటల వ్యవధిలో అంటే రాత్రి 12 గంటల వరకు 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం కలిగిన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.  దీంతో జిల్లా ఆసుపత్రిపై కొంతమేర ఒత్తిడి తగ్గింది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే.

Related posts