telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు: బొత్స

minister bosta in vijayawada meeting

సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ సెప్టెంబర్ 20 నుంచి వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. తొలి రోజునే దాదాపు 4.5 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు సూచించారు.

Related posts